కందుల ఆధ్వర్యంలో పవనన్న ప్రజా బాట 99వ రోజు

  • దక్షిణంలో కొనసాగుతున్న డాక్టర్ కందుల సేవా కార్యక్రమాలు
    ★ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యస్పందన
    ★ ఇద్దరు పెళ్లి కుమార్తెలకు సహాయం

విశాఖ, దక్షిణ నియోజకవర్గంలో పవనన్న ప్రజా బాట కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. నియోజకవర్గ జనసేన నాయకులు మరియు 32వ వార్డు కార్పోరేటర్ డాక్టర్ కందుల నాగరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం మంగళవారం 99వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఆయన పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. సహాయం అడిగిన వారికి కాదనకుండా తక్షణమే వారికి సహాయం చేస్తూ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ పట్టిష్టతకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇద్దరు పెళ్లి కుమారులకు అండగా నిలిచారు. 33 వ వార్డుకు చెందిన పెళ్లి కుమార్తె తిరుమలకు అలాగే 34 వ వార్డుకు చెందిన పెళ్ళికూతురు కృష్ణవేణికి తాళిబొట్లు, పట్టు చీర జాకెట్లు, పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులైన సరే ప్రజలకు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను నిలిపివేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.ప్రజలకు మంచి చేసేందుకు తాను ఎంతవరకైనా వెళ్తానని చెప్పారు. ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వాసుపల్లి నరేష్, అజయ్, మణి, మణికంఠ, జయ, వెకటేష్, కోదండమ్మ, శ్రీదేవి, మంగ, అరుణ, దుర్గ, కుమారి, దక్షిణ నియోజకవర్గ యువ నాయకులు కందుల బద్రీనాథ్ తోపాటు జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.