వందో రోజుకు చేరిన పవనన్న ప్రజా బాట

  • డాక్టర్ కందులకు బ్రహ్మ రథం పడుతున్న ప్రజలు
  • ప్రతిచోట నీరాజనాలు
  • సమస్యలు పరిష్కారానికి చొరవ
  • దక్షిణంలో కొనసాగుతున్న పవనన్న ప్రజా బాట

వైజాగ్ సౌత్: ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు, వాటి పరిష్కారానికి చొరవ చూపేందుకు దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు చేపట్టిన పవనన్న ప్రజాబాట 100వ రోజుకు చేరుకుంది. దక్షిణ నియోజకవర్గంలో ఆయన చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల బ్రహ్మరథం పడుతున్నారు.
ప్రతిచోట ఆయనకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్థానిక నాయకత్వం సహకారంతో వంద రోజులు పాటు ఈ కార్యక్రమాన్ని దక్షిణ నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగించారు. చాలా వరకు ప్రజా సమస్యలను ఆయన నెరవేర్చారు. నియోజకవర్గంలోని ప్రతి వార్డులో గడపగడపకు ఆయన పెళ్లి ప్రజల నుంచి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకోవడమే కాకుండా ఆ సమస్యల పరిష్కార సాధన కోసం కృషి చేశారు. పవన్ అన్న ప్రజా బాటలో భాగంగా 30వ వార్డు జాలారిపేటకు చెందిన వెళ్ళు కుమార్తె పావనికి తాళిబొట్టు, చీర జాకెట్టు, పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయడమే తన అభిమతం అని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో తాను ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలు చేపడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యజ్ఞశ్రీ, శ్రీ హరి, జోగిరాజు, చిరంజీవి, మణికంఠ, మణి, జయ, పద్మ, లలిత, దుర్గ, కుమారి, కందుల కేదార్నాథ్, కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.