చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అండ

  • రాష్ట్రంలో నియంత పాలన
  • “నిజం గెలవాలి” లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: రాష్ట్రంలో నియంత పాలన నడుస్తోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ పేర్కొన్నారు. గురువారం తిరుపతిలో జరిగిన నారా భువనేశ్వరి “నిజం గెలవాలి” కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎప్పుడూ రాజకీయాల్లో కనిపించని భువనేశ్వరి జనం మధ్యకు రావాల్సి వచ్చిందన్నారు. నిజం గెలవడం కోసం పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తూనే నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారన్నారు. చంద్రబాబు, లోకేశ్ ను వైకాపా అడ్డుకుంటోందన్నారు. ఈ ప్రభుత్వం వెయ్యి మందిపై అక్రమ కేసులు పెట్టిందన్నారు. అభివృద్ధి ప్రధాతయిన చంద్రబాబు ఒకవైపు, ఆశయంతో ఉన్న పవన్ కళ్యాణ్ మరో వైపు జనం కోసం పని చేస్తున్నారన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి అండతో నిజం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన, రాయలసీమ కో కన్వినర్ ఆకుల వనజ, జిల్లా కార్యదర్శి ఆనంద్, శివయ్య, నగర ఉపాధ్యక్షులు పార్ధు, లక్ష్మి, ప్రధాన కార్యదర్శి రుద్ర కిషోర్, కార్యదర్శులు, కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, కిరణ్, హేమంత్, పురుషోత్తం, సాయి, తిరుపతి అర్బన్ నాయకులు జనసేన సాయి, తిరుపతి రూరల్ నాయకులు గౌస్ బాషా, వీరమహిళలు మధులత, చందన, దుర్గ, జనసైనికులు మోహిత్, తదితరులు పాల్గొన్నారు.