రైతులకు భరోసా కల్పించలేరా?: కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: సింగనమల నియోజకవర్గంలో సామాజిక చైతన్య యాత్ర ప్రారంభించిన వైసిపి నాయకులారా.. రైతులకు భరోసా కల్పించలేరా? అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు, లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జయరాం రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికే పంటలన్నీ దెబ్బతిన్నాయి, మరొకవైపు పగటిపూటతొమ్మిది గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నేడు కనీసం పగటిపూట గంటా రెండు గంటలు కరెంటు ఇవ్వలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది? రైతుబాందు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొని రైతులని ఇలానే గాలికి వదిలేస్తారా? రైతులకు భరోసా కల్పించలేరా? గత ప్రభుత్వాలు సబ్సిడీ కింద స్పిన్క్లర్లు, డ్రిప్ ఇచ్చేవారు మీరు అధికారంలోకి వచ్చి నాటినుండి సబ్సిడీ ఎత్తేసి స్పిన్క్లర్లు, డ్రిప్పు సబ్సిడీ కింద ఇవ్వకపోవడం వలన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైసిపి నాయకులారా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, రైతులకు భరోసా కల్పించండి, తక్షణమే రైతులను ఆదుకోండి. కేవలం మీ పార్టీ ప్రచార ఆర్భాటం చేసుకుంటూ ముందుకు పోవడం కాదు చిత్తశుద్ధితో అనంతపురం జిల్లా రైతాంగని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని జయరాం రెడ్డి పేర్కొన్నారు.