నిరుపేద ఇంటిని ప్రారంభించిన జ్యోతుల దంపతులు

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామానికి చెందిన ములగపాటి సత్య ప్రకాష్ నూతనగృహాన్ని శనివారం పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు దంపతులు ప్రారంభించారు. ములగపాటి సత్య ప్రకాష్ ఆహ్వానం మేరకు జ్యోతుల శ్రీనివాసు దుర్గాడ గ్రామంలో ఉన్న ములగపాటి సత్య ప్రకాష్ నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్చిపాస్టర్ ఎం డి ఎం మణికర్ దంపతుల సమక్షంలో ములగపాటి సత్యప్రకాష్ నూతన గృహాన్ని పిఠాపురం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఆయన సతీమణి జ్యోతుల గంగాభవాని చేతులపై రిబ్బన్ కత్తిరించి నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో జ్యోతుల సీతారాంబాబు, బత్తిన ప్రవీణ్, కాపారపు నిర్మల్ కుమార్, బత్తిన వరప్రసాద్, గుల్ల నాగేశ్వరరావు, బత్తిన విజయ్ కుమారి, ములగపాటి లావణ్య, ములగపాటి చినబాబు, శివకోటి రమణ, ములగపాటి లక్ష్మి, దడాల సత్యనారాయణ, దడాల రాజు, దడాల దుర్గాప్రసాద్ మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.