రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన మర్రాపు సురేష్

విజయనగరం జిల్లా అలమండ వద్ద జరిగిన రైలు ప్రమాదం ఘటనలో గాయపడిన క్షతగాత్రులను మంగళవారం జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ విజయనగరం కేంద్ర ఆసుపత్రిలో పరామర్శించి, బాధితులకు ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరమహిళలు తుమ్మి లక్ష్మి, అశ్విని, జిల్లా నాయకులు మోహన్ రావు, డా.రవి కుమార్ మిడతాన పాల్గొన్నారు.