కాకినాడ సిటీ 24వ డివిజన్లో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటీ ఇన్చార్జ్ మరియు పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు బుధవారం జనసేన భీమ్ యాత్ర జనసేన పార్టీ జగన్నాధపురంలోని 24వ డివిజన్ ప్రాంతంలోని ముగ్గుపేటలో బోడపాటి మరియా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు స్థానిక దళితులను కలిసి వారికి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలని విశదీకరించారు. ఈ వై.సి.పి ప్రభుత్వం దళితుల ఓట్లు అర్ధించి అధికారంలోకి వచ్చిందనీ, తీరా వచ్చాక వారిపైనే దౌర్జన్యాలు చేస్తోందనీ, తిరిగి వారిపైనే ఎస్.సి & ఎస్.టి అట్రాసిటీస్ చట్టాన్ని ప్రయోగించి కేసులు బనాయిస్తోందని విమర్శించారు. దళితులంటే పూచికపుల్లతో సమానంగా ఈ ముఖ్యమంత్రి భావిస్తున్నాడనీ, అందుకే దళితులని చంపిన వారిని ప్రోత్సహిస్తూ పార్టీలో పదవులు ఇస్తున్నాడనీ, వై.ఎస్.ఆర్ కాంగ్రేస్ పార్టీ దళితవ్యతిరేక పార్టీ అని నిందిస్తూ వీళ్ళకి బుద్ధిచెప్పే రోజు దగ్గరపడిందనీ, జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పోరాటానికి మద్దతు ఇచ్చి వై.ఎస్.ఆర్ పార్టీని మట్టుబెట్టాలని దళితులకు పిలుపునిచ్చారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు కలశంలో సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, నాని, ప్రసన్న కుమార్, విజయ్, పాల్, బోడపాటి మరియా, బండి సుజాత, సోనీ ఫ్లోరెన్స్, దీప్తి తదితరులు పాల్గొన్నారు.