కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో పీపుల్స్ మేనిఫెస్టో రూపకల్పన

  • జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అందజేయనున్న చేగొండి హరి రామ జోగయ్య

అనంతపురం, నవంబర్ ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకులు ఆధ్వర్యంలో రూపొందించిన పీపుల్స్ మేనిఫెస్టోను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అందజేయనున్నట్లు కాపు సంక్షేమ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు, పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు పత్తి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారాలు, సంక్షేమం అభివృద్ధి తదితర ప్రధాన అంశాలను 20 మంది వివిధ రంగాల్లో నిష్ణాతులైన సభ్యులతో కమిటీ వేసి చర్చించిన అనంతరం పీపుల్స్ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. జనసేన టిడిపి గెలుపొందిన తర్వాత సంయుక్తంగా ఏర్పాటు కాబోయే ప్రభుత్వం అమలు చేయాలని చేగొండి హరి రామ జోగయ్య జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను కోరనున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధులు రాయపాటి అరుణ, శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినీడి తిరుమలరావు, రాష్ట్ర కార్యదర్శి చేగొండి సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.