బొంతు రామ్మోహన్ కు కేటీఆర్ ప్రశంసలు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) మాజీ మేయర్ బొంతు రామ్మోహన్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ ఐదేళ్ల కాలంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం అద్భుతమైన కృషి చేశారని ఆయన కొనియాడారు.
మేయర్గా బొంతు రామ్మోహన్ పదవీ కాలం నిన్నటి ముగియడంతో ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ర్టంలో జీహెచ్ఎంసీకి తొలి మేయర్గా బాధ్యతలు నిర్వర్తించడం తన అదృష్టంగా భావిస్తున్నానని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఐదేళ్ల కాలంలో తనను ఆదరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తన శక్తి మేర కృషి చేశానని పేర్కొన్నారు. ఈ అందమైన జర్నీలో మరిచిపోలేని జ్ఞాపకాలు ఎన్నో అని రామ్మోహన్ తెలిపారు. ఇవన్నీ తన జీవితాంతం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. తనపై ప్రేమ చూపించిన ప్రతీ హైదరాబాదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బొంతు రామ్మోహన్ ట్వీట్ చేశారు.
Congratulations on a job well done brother 👍 https://t.co/DXX2XFQUt8
— KTR (@KTRTRS) February 11, 2021