రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న గాదె

విజయవాడ, సి.పి.ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి వారి ఆధ్వర్యంలో కృష్ణా జలాల పున:పంపిణీకై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వలన ఏపీకి జరుగుతున్న అన్యాయంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ తరపున ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖా బాలు, మధు లాల్ తదితరులు పాల్గొన్నారు.