పుణ్యక్షేత్రం గ్రామంలో పలువురిని పరామర్శించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో పలువురిని జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో – ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గురువారం పరామర్శించడం జరిగింది. గ్రామానికి చెందిన మధ్య దుర్గారావు ఇటీవల ప్రమాదంలో చేతికి గాయమైందని తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అదే గ్రామానికి చెందిన నువ్వుశెట్టి సాయి ఇటీవల బైక్ యాక్సిడెంట్ ప్రమాదంలో గాయాలు పాలై కాలికి ఆపరేషన్ చేయించుకున్న విషయం తెలుసుకుని వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.