పొన్నలూరు చెరువులో దొంగలు పడ్డారు..!

  • సుమారు 8 నుండి 10 లక్షలు విలువచేసే చెట్లను నరికిన పొన్నలూరు దొంగలు ఎవరు…?

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలంలో ఉన్నటువంటి పెద్ద చెరువులో కొంతమంది దొంగలు పడి 8 నుండి 10 లక్షలు విలువచేసే చెట్లను నరికి ప్రజల సొమ్మును దోచుకున్నారు, అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, వేలంపాట నిర్వహించకుండా పచ్చని చెట్లను నరికి సొమ్ము చేసుకున్నారు, ఎర్రచందనం ఏనుగు దంతాలు స్మగ్లర్ వీరప్పనని కనిపెట్టినట్టుగా, బ్యాంకు దొంగ టైగర్ నాగేశ్వరావుని కనిపెట్టినట్టుగా, పొన్నలూరు చెరువులో పడ్డ దొంగలను కూడా అధికారులు వెంటనే కనిపెట్టాలి, దొంగలను కనిపెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే పై అధికారుల దృష్టికి ఈ సమస్యను జనసేన తీసుకుపోతుంది, అవసరమైతే ధర్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము, అధికారులు వెంటనే స్పందించి పొన్నలూరు చెరువుని దోచుకున్న దొంగలను కనిపెట్టి శిక్ష పడేవిధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాము అని పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్ణ తిరుమలరెడ్డి, సుంకేశ్వరం శ్రీను, చెన్నయ్య, వెంకటరెడ్డి, మహేంద్ర, మదన్, మరియు కొంతమంది జనసేన నాయకులు పాల్గొన్నారు.