అధికార మదంతో విర్రవీగుతున్నారా..?: తిరుపతి అనూష
విజయవాడ, దేశం కోసం పోరాడిన నాయకుల పేర్లు, అదేవిధంగా దేవుళ్ళు పేర్లు కూడా తొలగించే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని, ఒకసారి గెలిస్తేనే ఇంత అధికార మదంతో విర్రవీగుతున్నారా అని తిరుపతి అనూష ప్రశ్నించారు…? విజయవాడ భవానిపురం శివాలయం సెంటర్ ని వైఎస్ఆర్ సెంటర్ గా మార్చేసిన ఘనత వైసిపి పార్టీకి దక్కింది అని తెలియ చేశారు. ఒక అర కిలోమీటర్ లోపు వైఎస్ఆర్ విగ్రహాలు మూడు విగ్రహాలు ఏర్పాటు చేయటం, అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ పేరు మార్చి వైయస్సార్ పార్కు పేరు పెట్టడం, అడిగే వారు లేరనా? ఇంత దుర్మార్గంగా చేస్తున్నారు. ప్రజలంతా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా ప్రజలు మీ అధికార మదానికి త్వరలోనే గుణపాఠం చెప్తారని అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-04-at-14.50.36-921x1024.jpeg)