ఉచిత కంటివైద్య శిబిరాన్ని ప్రారంభించిన పితాని

ముమ్మిడివరం: తాళ్లరేవు మండలం, పి.మల్లవరం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ వి ఆర్ ఎన్ బి ప్రసాద్ నిర్వాహణలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంను ముఖ్య అతిథిగా విచ్చేసిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రసాద్ సేవల గురించి కొనియాడారు. ఈ శిబిరంనకు కంటి పరీక్షల నిమిత్తం వచ్చినటువంటి వారి అందరిని దగ్గరుండి ఆప్యాయంగా పలకరించారు. ఆసుపత్రి సిబ్బంది వారు చేసే పరీక్షలను కూడా దగ్గరుండి పితాని పరిశీలించారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో కిరణ్ కంటిఆసుపత్రి వారు దాదాపు 100 మందికి ఉచిత ఆపరేషన్ చేయిస్తున్నారు.