బాప్తిస్ట్ చర్చ్ పునర్నిర్మాణం కొరకు బొర్రా విరాళం

సత్తెనపల్లి నియోజకవర్గము: ముప్పాళ్ళ మండలం, దమ్మాలపాడు గ్రామంలోని తెలుగు బాప్తిస్ట్ చర్చ్ పునర్నిర్మాణం కొరకు సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు ఆధ్వర్యంలో ధూళిపాళ్ల గ్రామ జనసేన పార్టీ కార్యాలయంలో కంచేటి అప్పారావు చేతుల మీదుగా తెలుగు బాప్తిస్ట్ చర్చి నిర్వాహకులు అయిన చింతపల్లి రుద్రయ్య, చింతపల్లి రమేష్, గడ్డిపర్తి బోయజు, వేల్పుల అబ్రహం, చింతపల్లి మరియదాసులకు 25000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన నాయకులు పాల్గొన్నారు.