అనకాపల్లి నియోజకవర్గ జనసేన విస్తృత స్థాయి సమావేశం
అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు అనకాపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ పరుచూరి భాస్కర రావు ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా రూరల్ అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్యఅతిథిగా ఈ సమావేశం నిర్వహించారు. అనకాపల్లి పట్టణంలో పెంటకోట కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ సమావేశానికి నియోజకవర్గం జనసైనికులు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీగా పార్టీ కార్యాలయం నుండి సమావేశం వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పరుచూరి భాస్కరరావు గారు మాట్లాడుతూ ప్రస్తుతం రూరల్ జిల్లా బలమైన నాయకత్వంతో ముందుకు వెళుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో పక్కా ప్రణాళికతో కృషిచేసి జనసేన టిడిపి కూటమి ఘన విజయం సాధించడానికి అనకాపల్లి నుండి నాంది పలుకుతామని అన్నారు. అనంతరం పంచకర్ల రమేష్ బాబు గారు మాట్లాడుతూ అనకాపల్లిలో మంత్రి అమర్ ని రాష్ట్రంలో వైఎస్ జగన్ ని గద్దె దింపి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించాలని అన్నారు. భాస్కర్ రావు గారి నాయకత్వంలో అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. సమావేశం అనంతరం అనకాపల్లి మండలం అనకాపల్లి పట్టణం మరియు కసింకోట మండలం కోర్ కమిటీ సభ్యులు రమేష్ బాబు గారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-07-at-8.06.01-PM-1-1024x681.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-07-at-8.06.01-PM-2-1024x681.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-07-at-8.06.01-PM-1024x681.jpeg)