బత్తుల బలరామకృష్ణను గృహ నిర్బంధం చేసిన పోలీసులు

రాజానగరం: మండపేట నియోజకవర్గం, కేశవరం గ్రామంలో సర్వే నెంబర్ 7/2బి పార్ట్ 3&4 లో జగనన్న కాలనీల పేరిట కోర్టు ఆదేశాలకు తుంగలో తొక్కి, వైస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అనుచరులు అక్రమంగా దోచుకుంటున్న 2,50,000 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణని మంగళవారం పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి తరలించి విడిచిపెట్టారు. బుధవారం ఉదయం 6గంటల నుంచి ఆయన్ని వల్లూరు గ్రామంలో హౌస్ అరెస్టు చేశారు. శ్రీ లీలాకృష్ణ కు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ బత్తుల బలరామకృష్ణను ఇతర సీనియర్ నాయకులను రాజమండ్రిలో వారి స్వగృహం నందు పోలీసులు గృహ నిర్భంధం చేశారు.