అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న బొంతు

రాజోలు నియోజకవర్గం: సఖినేటిపల్లి మండలం, సఖినేటిపల్లి మొక్కతోటలో మొక్కతోట సంఘం&యూత్ కలిసి ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు పాల్గొని అంబేద్కర్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్ మన ఆరాధ్య దైవం ఆయన అడుగుజాడల్లో నడవాలి మన కోసం మన బావితరాలు కోసం ఆయన ఆశయాలు అనుగుణంగా నడవాలి. ఆయన అందరి వాడని, ఆయన అందరూ సమానంగా జీవించాలనే ఆలోచించారని అన్నారు. ఈ విగ్రహం పెట్టిన మొక్కతోట సంఘ పెద్దలను, యూత్ వారిని అభినందించారు.