పొన్నలూరు జనసేన నాయకులను అభినందించిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల

  • షేక్ రియాజ్, పెదపూడి విజయ్ కుమార్, రాయపాటి అరుణ గార్లకి ధన్యవాదాలు తెలిపిన కనపర్తి మనోజ్ కుమార్

కొండెపి: నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం, పొన్నలూరు మండలం, జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ ని మరియు మండల నాయకుల్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, షేక్ రియాజ్, పెదపూడి విజయ్ కుమార్, రాయపాటి అరుణ ట్విట్టర్ ద్వారా అభినందించారు. పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అదే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం జరుగుతుంది, 4.5 కిలోమీటర్ల నాగిరెడ్డిపాలెం నుండి చెరుకూరు వరకు ప్రధాన రహదారికి మరమ్మతులు చేయడం జరిగింది, జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను ఎన్నెన్నో పరిష్కరించడం జరిగింది. నాకు అన్ని విధాల అండగా తోడుగా నా పోరాటంలో భాగస్వాములైన ఐటీ విభాగం అధ్యక్షులు పిల్లిపోగు పీటర్ బాబు, ఉపాధ్యక్షులు కర్ణ తిరుమలరెడ్డి, ఉపాధ్యక్షులు పెయ్యల రవికుమార్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఖాదర్ బాషా, ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా, ప్రధాన కార్యదర్శి సుంకేశ్వరం సాయి, కార్యదర్శి సుంకేశ్వరం శ్రీను, కార్యదర్శి కాకాని ఆంజనేయులు, కార్యదర్శి పారబత్తిని చెన్నయ్య, కార్యదర్శి నవీన్, కార్యదర్శి మెండ భాను, కార్యదర్శి పులి రామరాజ, ఐ టీ విభాగం అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని కనపర్తి మనోజ్ కుమార్ తెలియజేశారు.