వాసగిరి మణికంఠ సేవలకు గుర్తింపు

  • గుంతకల్ నియోజకవర్గం జనసేన-టిడిపి సమన్వయ బాధ్యుడిగా క్రియాశీలక పదవి

గుంతకల్, ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త, సేవాతత్పరుడు అన్నింటికీ మించి మెగా కుటుంబానికి వీర విధేయుడైన వాసగిరి మణికంఠ సేవలకు గుర్తింపు లభించింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి అధ్యక్షులు వారు ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ ఆయా కార్యక్రమాలు జయప్రదం చేయడానికి విశేష కృషి చేసిన ఆయనకు గుంతకల్ నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ బాధ్యుడిగా క్రియాశీలక బాధ్యతలు అప్పగించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆమోదంతో గుంతకల్ పట్టణం వాసి అయిన వాసగిరి మణికంఠకు ఈ అవకాశం రావడం పట్ల జనసేన శ్రేణుల నుండి హర్షం వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ మా జనసేనాని నాపై ఉంచిన నమ్మకాన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తానని తెలియజేస్తూ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్, జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ కు గుంతకల్ నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలిపారు.