జవహార్ లాల్ నెహ్రుకు నివాళులు అర్పించిన రామ శ్రీనివాస్
రాజంపేట: జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాజంపేట పట్టణంలో అగ్రహారం నందు ప్రభుత్వ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలను సందర్శించి జవహార్ లాల్ నెహ్రు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి అనంతరం పిల్లలతో కలిసి బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు రామ శ్రీనివాస్, టీడీపీ మహిళ నేత వాణి శంకర్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత నిర్మాతలు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు రామ శ్రీనివాస్, టీడీపీ మహిళనేత వాణి శంకర్, మైనార్టీ నేత మహబూబ్ భష, సామాజిక సేవకుడు రామంజులు మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-14-at-7.03.41-PM-1024x768.jpeg)