ప్రజా ప్రతినిధులకు గౌరవం ఏముంది.?

*మండల సమావేశంలో ద్వజమెత్తిన జనసేన ఎంపీటీసి కనకదుర్గ.

అమలాపురం, గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులకు కనీస గౌరవం లేదు. వాలంటీర్లకు ఉన్నపాటి విలువ మాకు లేదు. ఇక మేము ఉండి ఏమి ప్రయోజనం అంటూ చిందాడ గరువు జనసేన ఎంపిటిసి మోటూరి కనక దుర్గ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ…అధికారులు కూడా గ్రామాల్లోకి వచ్చి వెళ్ళిపోతున్నారు తప్ప సర్పంచ్ లకు, ఎంపీటీసీలకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.