ప్రచార రథాలకు పూజలు నిర్వహించిన ముయ్యబోయిన ఉమాదేవి

తెలంగాణ, అశ్వరావుపేట నియోజకవర్గం: జనసేన పార్టీ ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో బిజెపి నాయకుల సమక్షంలో మంగళవారం శ్రీ ఆంజనేయ దేవస్థానం వద్ద అశ్వారావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముయ్యబోయిన ఉమాదేవి ప్రచార రధాలను పూజ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు గరికే రాంబాబు, మండల నాయకులు, కార్యకర్తలు బొక్క వెంకటేశ్వర్లు, ఎస్ కే జాన్ పాషా, గోపగాని సాయి ప్రకాష్, మాణితాల శివప్రసాద్, గోపగాని పవన్ కళ్యాణ్, అలుగుల శ్రావణ్ కుమార్, బిజెపి మండల అధ్యక్షులు అనుముల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పెండ్యాల అప్పన్న, మండల ప్రధాన కార్యదర్శి శనగపాటి సీతారాములు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.