జనసేన బలోపేతానికి కృషి చేస్తా: ఎన్ని రాజు
శ్రీకాకుళం: రాజాం జనసేన పార్టీ జనసేన-టీడీపి పార్టీ పాయింట్ అఫ్ కాంటాక్ట్ గా నియమితులైన రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ని రాజుని కోర్లవలస గ్రామ జనసైనికులు టంకాల గణేష్, అనపర్తి గణేష్ జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని రాజు మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ నాపై పెట్టుకున్న నమ్మకానికి, మరింత బాధ్యతగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లో మరింత బలంగా తీసుకువెళ్తానని తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-15-at-9.44.24-PM-1-1024x475.jpeg)