స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో స్కాముపై చైతన్యం కార్యక్రమం జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య ఆధ్వర్యంలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ వద్దనున్న శ్రీ. బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహం వద్ద జరిగింది. ఈ సంధర్భంగా తలాటం సత్య మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నిన్న బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్ల గారు మాట కాకినాడలో ప్రతి చోట అనే నినాదంతో ప్రతిరోజూ చేయడం ఈరోజు నుండీ మొదలుపెడుతున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెస్తున్న విద్యా దీవెనలో స్కూలు విద్యార్ధినీ విద్యార్ధుల బ్యాగులు, షూల విషయంలో అవినీతికి నిరసనగా ఈ స్కాము చైతన్య యాత్రని భారత రాజ్యాంగ నిర్మాత శ్రీ. బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహం వద్ద చేస్తున్నామని తెలియచేసారు. ఆయన మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు మేనమామ అని చెప్పుకుంటూ స్కూలు బ్యాగ్స్లలోను, షూలలోను అవినీతి చేసారని తెలుసుకున్నామన్నారు. రానున్న కాలంలో ముత్తా శశిధర్ గారి నాయకత్వంలో సిటీలోని ప్రభుత్వ స్కూళ్ళకెళ్ళి విధ్యార్ధుల ద్వారా వారి తల్లితండ్రులకి ఈ మోసాన్ని వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.