కొత్తపేట నియోజకవర్గంలో జనసేన – టీడీపీ తొలి ఆత్మీయ సమావేశం

కొత్తపేట నియోజకవర్గం: కొత్తపేటలో బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపం నందు జనసేన – టీడీపీ ల ఆత్మీయ సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని గద్ది దించే విధంగా ఇరుపార్టీలు కలిసికట్టుగా పనిచేసి ఒకరికి ఒకరు సహకరించుకోవాలని చర్చించుకోవడం జరిగింది. ప్రస్తుతం ఓటర్ జాబితాలో నెలకొన్న అవకతవకలుపై, ఇరుపార్టీల సానుకూల ఓట్లు తొలగించిన వైసీపీ విధానంపై పోరాడాలి అని జనసేన పార్టీ నియోజకర్గ ఇంఛార్జి బండారు శ్రీనివాస్ ఇరు పార్టీ శ్రేణులకు సూచించారు. అతి త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో వస్తుందని అది వచ్చిన తరువాత ఉమ్మడి కార్యాచరణ ప్రకటించుకుని క్షేత్రస్థాయిలో ఓటును అభ్యర్థిస్తూ ప్రచారం కొనసాగించాలని ఇరు పార్టీల క్యాడర్లకు తన సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి తరుపున నియోజకవర్గ ఇన్చార్జ్ బండారు సత్యానందరావు, వాసిరెడ్డి రాంబాబు, ఆకుల రామకృష్ణ తదితరులు పాల్గొనగా, జనసేన పార్టీ తరుపున చోడిశెట్టి చంద్రశేఖర్, తాళ్ల డేవిడ్, బొక్కా ఆదినారాయణ, సంగీత సుభాష్, సూరపురెడ్డి సత్య, తోట స్వామి, చేకూరి కృష్ణంరాజు, కంఠంశెట్టి చంటి, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.