వైసిపి కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన బత్తుల

  • “జన సునామీ”లా వైసీపీ నుండి జనసేన పార్టీలోకి భారీ నుండి అతి భారీ చేరికలు
  • రాజానగరం మండలంలో తుడిచిపెట్టుకుపోయిన వైసిపి
  • వైసీపీకి నిత్యం దెబ్బ మీద దెబ్బ కొడుతూ… కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జనసేన ఫైర్ బ్రాండ్ “బత్తుల బలరామకృష్ణ”
  • వైస్సార్సీపీ చూపించిన బూటకపు చేరికలకు, దిమ్మ తిరిగేలా…. బొమ్మ కనబడేలా….అదుర్స్ అనేలా కౌంటర్ ఇచ్చి…. జనసైనికులను కాలర్ ఎగరేసేలా చేసిన “బత్తుల”
  • “బత్తుల” ఆధ్వర్యంలో మూడు గంటలపాటు వైసీపీ నుండి జనసేన పార్టీలోకి ఉధృతంగా కొనసాగిన చేరికలు
  • రాజానగరం నియోజకవర్గం ఇప్పుడు వందకి 100 శాతం పూర్తిగా జనసేన మయం
  • మారాల్సిన సమయం ఆసన్నమైంది…. భారీ చేరికలతో జన ప్రవాహంతో పోటెత్తిన ప్రజాబలం..
  • రానున్న రోజుల్లో వైసీపీ నుండి మరిన్ని చేరికలతో ఎన్నికలకు ముందే “విజయోత్సవం” చేసుకునే స్థాయిలో జనసేన పార్టీ
  • జనసేన తీర్థం పుచ్చుకున్న వైసీపీ కి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, సీనియర్ నేతలు,కార్యకర్తలు 850 మంది పైనే
  • “బత్తుల బలరామకృష్ణ” గారు సృష్టిస్తున్న జన ప్రభంజనానికి చిన్నాభిన్నమైన ‘జక్కంపూడి’ క్యాడర్
  • రాజానగరం నియోజకవర్గంలో చాప కింద నీరులా గ్రామ గ్రామాన శరవేగంగా విస్తరిస్తున్న జనసేన పార్టీ హవా.. నిశ్శబ్ద విప్లవానికి నాంది. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న “జనసైనికులు”
  • నేడు చేరిన వారిలో.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు ముఖ్యంగా మహిళలు
  • జనసేన పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం.. గ్రాఫ్ పెరగడంతో పూర్తిగా పట్టు బిగించిన జనసేన పూర్తిగా డీలపడ్డ వైస్సార్సీపీ..
  • ఎన్నికలు ఎప్పుడోచ్చినా నియోజకవర్గంలో ఈ అరాచక వైస్సార్సీపీ రాక్షస పార్టీని గద్దె దింపి, జనసేన పార్టీని గెలిపించడానికి ‘బత్తుల’ ఆధ్వర్యంలో పక్కా ప్రణాళికతో దూకుడు

రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ పార్టీలో జాయిన్ అయిన దగ్గర్నుండి నిత్యం నియోజకవర్గంలో ఇతర పార్టీలకి చెందిన కార్యకర్తలను జనసేన పార్టీలోకి పెద్ద ఎత్తున జాయినింగ్స్ చేస్తూనే ఉన్నారు. రాష్ట్రం మొత్తం రాజానగరం నియోజకవర్గం గురించే చర్చించుకునేలా శరవేగంగా పార్టీని ముందుకు తీసుకెళుతున్న ఈ శుభతరుణంలో రాజానగరం మండలం, దివాన్ చెరువు గ్రామంలో జరిగిన “జన శ్రేణుల ఆత్మీయ సమావేశం” లో రాజనగరం మండలం నుండి వివిధ గ్రామాల నుండి వైసీపీ శ్రేణులు అరాచక పాలన చేస్తూ.. నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సహజ వనరులను దోచుకు తింటూ, అసమర్ధ పాలన చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పనితీరుకు విసుకు చెంది.. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు ఆయన రాజకీయ ప్రయాణం, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన పడుతున్న తపన.. అదే సమయంలో రాజానగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి గార్ల దంపతులు అనునిత్యం చేస్తున్న పార్టీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు.. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటున్న తీరు, చేస్తున్న దానధర్మాలు, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు ఆయన నిలబడుతున్న తీరు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ఆయన సమర్థమైన నాయకత్వానికి ఆకర్షితులై….. బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన ముఖ్య నాయకులు మాజీ గ్రామ కమిటీ అధ్యక్షులు వార్డు మెంబర్లు 850 మంది జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.. వీరందరికీ బత్తుల బలరామకృష్ణ గారు జనసేన పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కోసం అందరూ సమిష్టిగా కృషి చేసి, నీతి నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని రక్షించి, ఈ అరాచక ప్రభుత్వంపై అందరూ సమిష్టిగా తిరుగుబాటు చేసి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపి, పారదర్శకంగా అవినీతిరహిత ప్రజాపాలన తీసుకురావడానికి అందరూ సమైక్యంగా శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, దివాన్ చెరువు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.