మోపిదేవి మండల జనసేన – టీడీపిల అధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

అవనిగడ్డ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు అధ్వాన్నంగా ఉన్న రోడ్ల దుస్థితిని డిజిటల్ క్యాంపెయిన్ రూపంలో తెలియజేయుటకు గాను శనివారం ఉదయం మోపిదేవి మండల జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో మోపిదేవి – రావివారిపాలెం – బొడగుంట – వెంకటాపురం – శివరామపురం – కొక్కిలిగడ్డ కొత్తపాలెం – కొక్కిలిగడ్డ గ్రామాలకు వెళ్ళే రోడ్డుల పరిస్థితి మీద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోపిదేవి మండల జనసేన – టీడీపి మండల స్థాయి నాయకులు, మండల కమిటీ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, ఇరు పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.