జిల్లా స్థాయిలో బిజెపి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తాం

తెలంగాణ, మంచిర్యాల జిల్లా, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ సైదాల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు తన్నీరు మధుకర్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జనసేన పార్టీ నాయకులు బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్, చెన్నూరు బీజేపీ అభ్యర్థి దుర్గం అశోక్ లను కలవడం జరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయిలో బిజెపి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పని చేస్తాం. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యార్ధి విభాగం నాయకులు ఆవుల సాగర్, యువజన విభాగం ఉపాధ్యక్షులు పిట్టల సుధాకర్ నియోజకవర్గ నాయకులు వడ్లకొండ జీవన్ కుమార్ నాయకులు సురేష్, విజయ్, కిరణ్, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే బిజెపికి పట్టం కట్టాలి. పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన బిజెపి అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే, ఓటు వేస్తే మళ్ళీ మోస పోవడం ఖాయం. కేసీఆర్ ఈ ఎన్నికల్లో మంచిర్యాల నీనియోజకవర్గంలో ఇద్దరు వ్యక్తులను నిలబెట్టాడు, ఒకరికి బి ఫామ్ ఇచ్చి, మరొకరికి డబ్బులిచ్చి పోటీలో ఉంచాడు. నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ ఇద్దరు పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారు. గత పాలకుల హయాంలో దోపిడీ జరిగేది, మోడీ పాలనలో దళారులు లేకుండా ప్రజలకు న్యాయం జరుగుతుంది. తెలంగాణలో బిజెపి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. నేను ఎమ్మేల్యేగా గెలిస్తే నా జీతం పేద విద్యార్థుల చదువులకు ఖర్చు చేస్తా అని అన్నారు.

కొత్తగూడెంలో జనంలోకి జనసేన

తెలంగాణ, కొత్తగూడెం, జనంలోకి జనసేన కార్యక్రమం చేపట్టడంలో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి లక్కినేని సురేందర్ జనసేన పార్టీ నాయకులు శనివారం జనంలోకి ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగా జనసేన నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు మరియు బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు కొత్తగూడెం టౌన్ ప్రెసిడెంట్ సాదిక్ పాషా బిజెపి టౌన్ ప్రెసిడెంట్ లక్ష్మణ అగర్వాల్ మరియు జనసైనికులు అభిమానులు కార్తీక్, హతిరావు, అనిల్, బాలకృష్ణ, లక్ష్మణ్, మార్గం సందీప్, రాంబాబు, బ్రహ్మం, బాషా, దేవా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.