ముమ్మారెడ్డి ప్రచారంలో పాల్గొన్న పృధ్వీరాజ్

తెలంగాణ, కూకట్పల్లి నియోజకవర్గం, ఫతేనగర్ డివిజన్, భరత్ నగర్, నల్ల పోచమ్మ ఆలయం నుండి మంగళవారం బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ఫతేనగర్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కి బిజెపి శ్రేణులు, జనసేన శ్రేణులు, మహిళా నాయకులు గజమాల వేసి హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు. గూడ్స్ షెడ్ రోడ్డు, భవాని నగర్, హెచ్ పి రోడ్డు, జింకలవాడ, సమతా నగర్,భీమ్ ల నగర్, శివాలయం వరకు పాదయాత్ర కొనసాగించారు. పాదయాత్రలో ప్రముఖ సినీ నటులు మరియు జనసేన పార్టీ నాయకులు పృధ్వి రాజ్ బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కూకట్పల్లి ప్రజలు, ఓటర్ మహాశయులరా మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గుర్తు, గాజు గ్లాసు మీద మీ అమూల్యమైన ఓటును ఓటు వేసి ప్రేమ కుమార్ ని గెలిపించాలని కోరారు. ఆనంతరం ప్రేమ కుమార్ మాట్లాడుతూ ఏ డివిజన్లో చూసిన ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, కూకట్పల్లి నియోజకవర్గం లో ఏ అధికారికి చెప్పిన పట్టించుకునే వారే లేరని పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. ప్రజలు తప్పకుండా ఈసారి ఓటు అనే ఆయుధంతో స్థానిక నాయకులకు సరైన సమాధానం చెప్పాలని అన్నారు. మీరందరూ కలిసి గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి గోవా రాష్ట్ర అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు సదానంద్ శేట్ తనవాడే తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం బిజెపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ కి మద్దతుగా ప్రచార పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. మన ఎన్నికల గుర్తు గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి మన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా (అర్బన్) అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి, శ్రీకర్ రావు, మూసాపేట్ కార్పొరేటర్ మహేందర్, ఎ.సూర్య రావు, యంజాల పద్మయ్య, తూము శైలేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,జిల్లా కార్యవర్గ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ నాయకులు,మహిళా నాయకులు, మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు, డివిజన్ నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.