జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలి: బెల్లంకొండ

గిద్దలూరు నియోజకవర్గం: బెస్తవారపేట మండల జనసేన పార్టీ సమావేశం మంగళవారం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో గిద్దలూరు జనసేన పార్టీ ఇంఛార్జి బెల్లంకొండ సాయిబాబు మాట్లాడుతూ.. మండలంలో గ్రామ పర్యటనకు మండల నాయకులు అందరు సహకరించాలని మీ విలువైన సమయాన్ని రాబోవు అయిదు నెలలు పార్టీ కోసం సమయం కేటాయించాలని కోరారు. పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. బెస్తవారపేట మండలంలో రైతులు ఎదుర్కొన్న సమస్యలను నియోజక వర్గం సమస్యలతో కలిపి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్తామని చెప్పారు. 2,3 రోజుల్లో గ్రామ పర్యటనకు తేదీలు తెలుపు తామీనీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, కంభం మండలం అధ్యక్షుడు తాడిశేట్టి ప్రసాద్, బెస్తవారపేట మండల నాయకులు ముంతల మధు సుదన్ రెడ్డి, ఇల్లురి అనిల్, కువ్వరపు దేవరాజ్, దమ్ము తిరుపాలు, తోట శ్రీనివాసులు, మేకల కుమార్, బండ్లమూడి బాల ఈశ్వరరావు, తోటకూరి కొండయ్య సందేపోగు యోహన్, బుదల శేషయ్య, ముక్క ఒబాయ్యా, మట్టేమల్ల భాస్కర్ అర్ధవేడు నాయకులు వీరణల గోపాల్, బెల్లంకొండ భాను, లంకా లక్ష్మణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.