ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 12వ రోజు

  • శ్రీకాళహస్తిలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ -టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఉమ్మడి మినీ మానిఫెస్టోను శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా శ్రీకాళహస్తి పట్టణం బంగారమ్మ కాలనీలో ఇంటింటికీ ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. మరియు ప్రజలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని కోరడం జరిగింది. స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ కాలువలు పారిశుధ్యం, నిత్యావసర వస్తువుల అధిక ధరల గురించి ప్రజలు తెలిపారు. సమస్యలన్నీ ప్రభుత్వం వచ్చిన 3-6 నెలల్లో పరిష్కరిస్తామని వినుత గారు ప్రజకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, ప్రధాన కార్యదర్శి పేట చిరంజీవి, పేట చంద్ర శేఖర్, నాయకులు కవిత, శారద, సారిక, సురేష్, జ్యోతి రామ్, హేమంత్, దినేష్, ఉదయ్, బత్హెమ్మ, గురవమ్మ తదితరులు పాల్గొన్నారు.