లోకం మాధవి ఆధ్వర్యంలో ఇంటింట జనసేన

నెల్లిమర్ల నియోజవర్గం: పూసపాటిరేగ మండలం, సిహెచ్ అగ్రహారం పంచాయతీలో గొడిగుడ్డు మరియు దిగువ పోరం నందు గురువారం లోకం మాధవి ఆధ్వర్యంలో ఇంటింట జనసేన జనంలోకి తీసుకెళ్లడం జరిగింది. జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు మరియు మేనిఫెస్టో జనాలకు వివరించడం జరిగింది. మరియు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇవ్వమని లోకం మాధవికి ఒక ఛాన్స్ ఇవ్వమని జనాలని కోరడం జరిగింది. మరియు ఈ ఊర్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని మేడం గారు దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వీరమహిళ పాల్గొనడం జరిగింది. గుడివాడ జమరాజు, బూర్ల విజయ శంకర్, బాసి దుర్గ, బోర సతీష్, బోనాల నర్సింగరావు, కోట రాజారావు, సుందరం, గొల్ల రావు, పైడి రాజు, రమేష్, ఆర్ రమేష్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.