నిరుపేద ఆటొడ్రైవర్ కుటుంబానికి జ్యోతుల ఆర్థిక భరోసా

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం మున్సిపాలిటీ సీతయ్యగారి తోట, జీవన్ నగర్, ఎస్సీ (ఎం.డి)పేటకు చెందిన పెదపూడి వీరబాబు స్వంత పాసింజర్ ఆటో ద్వారా ఉపాధి పొందేవాడు. పెదపూడి వీరబాబు రెండు కాళ్లకు ఇన్ఫెక్షన్ రావడం వల్ల గత 6నెలల నుంచి కాళ్లకు ఇన్ఫెక్షన్ కారణంగా అయిన గాయలకు జరిగి వైద్యం, మందుల ఖర్చుల నిమిత్తం పెదపూడి వీరబాబుకు గల ఆటోని అమ్ముకుని వైద్యం చేయించుకొన్నా కారణంగా ఏ విధమైన జీవనోపాధి లేకుండా తీవ్ర పేదరికంలో బాధపడుతున్న పెదపూడి వీరబాబు కుటుంబ ఆర్దికపరిస్దితిని చూసిన ఎస్సీ (ఎం.డి) పేటకు చెందిన యామగిరిరమేష్ ఫోను ద్వారా సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు, జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసుకు పెదపూడి వీరబాబు కుటుంబ ఆర్థికపరిస్థితి గురించి వివరించగా వెంటనే స్పందించిన జ్యోతుల శ్రీనివాసు శనివారం ఉదయం పిఠాపురం సీతయ్యగారితోట, జీవన్ నగర్ వెళ్ళి పెదపూడి వీరబాబుని పలకరించి అతనికి వైద్యనిమిత్తం రూ. 5000/- రూపాయలను పెదపూడి వీరబాబుకి అందించారు. ఈ సందర్భంగా పెదపూడివీరబాబు భార్య అయిన పెదపూడిలక్ష్మీకి 25 కేజీల బియ్యం, 2 నెలలకు సరిపడే కిరాణాసామాన్లు ఆమెకు అందించి వారికి తగు సహాయసహకారాలను అందించారు. ఈ కార్యక్రమంలో జనసేననాయకులు మామిడాల సూరిబాబు, గంటా గోపి, జిల్లా ఎం.ఆర్.పి.ఎస్ అధ్యక్షులు యేడిద రాములు, పిఠాపురం టౌన్ ఎం.ఆర్.పి.ఎస్ వైస్ ప్రెసిడెంట్ అత్తమూరు దేవుడు, ఏడిద శ్రీను, మోర్త నాగేశ్వరరావు, యామగిరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.