రాష్ట్ర అభివృద్ధికై జనసేనకు ఒక ఛాన్స్ ఇవ్వండి
- వీరబల్లి జనసేన నాయకులు
- పవనన్న ప్రజా బాట 126వ రోజు
రాజంపేట నియోజకవర్గం: వీరబల్లి మండలంలోని గడిగోట పంచాయితీలో శనివారం రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు వీరబల్లి మండల నాయకులు జయరామయ్య ఆధ్వర్యంలో పవనన్న ప్రజా బాట 126వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జయరామయ్య మాట్లాడుతూ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి జనసేన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్య వంతులు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టిడిపి బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు గుండా రాజకీయాలు దోపిడీలు చేస్తూ వైకాపా పాలన కొనసాగుతుందని తెలిపారు. ఎదురు తిరిగిన వారిపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వారిని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జయరామయ్య, స్వామి, భాస్కర్ పంతులు, పోలిశెట్టి శ్రీనివాసులు, కిషోర్, వీరమహిళలు జండా శిరీష, మాధవి చతుర్లు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-25-at-9.02.52-PM-1024x768.jpeg)