కూకట్ పల్లి నియోజకవర్గంలో శెట్టిబలిజ సోదరుల మద్దతు కోరిన పితాని

తెలంగాణ, కూకట్ పల్లి నియోజకవర్గం: రాష్ట్ర జనసేనపార్టీ ఆదేశాలమేరకు రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కు మద్దతుగా ఎలక్షన్ కాంపెయినింగ్ కు వెళ్లి కూకట్ పల్లి శెట్టిబలిజ కులపెద్దలను, శెట్టిబలిజ సంఘాలను, శెట్టిబలిజ సోదరులను కలిసి జనసేనపార్టీకి మద్దతు తెలుపవలసిందిగా కోరారు.