అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జనసేన

ఇచ్చాపురం నియోజకవర్గం, కేదారిపురం గ్రామంలో పూరింట్లో నివసిస్తున్న నరసింహ శెట్టి, చంద్రమ్మ శెట్టి ఇల్లు ఆదివారం రాత్రి కాలిపోయిన విషయాన్ని జనసైనికులు ఇచ్చాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజుకి తెలియపరచడంతో సోమవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి మీకు మీ కుటుంబాన్నికి ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుందని ధైర్యాన్ని చెప్పి జనసేన పార్టీ తరఫునుంచి దాసరి రాజు ఒక రైస్ ప్యాకెట్ నిత్యావసర సరుకులు మరియు అక్కడ స్థానిక జనసేన నాయకులు బోర మోహన్ రావు 1000, రూపాయలు నగదు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ తిప్పన దుర్యోధన రెడ్డి మరియు జనసేన నాయకులు రాజు శెట్టి, గణేష్, రాజేష్, టున్న శెట్టి, ఇచ్చాపురం మున్సిపాలిటీ 10, 11వ వార్డ్ ల ఇంచార్జ్లు రోకళ్ల భాస్కరరావు, కలియ గౌడో, సతీష్, అశోక్, కోగేష్ తదితరులు పాల్గొన్నారు.