ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ని గెలిపించాలి: వడ్డేపల్లి రాజేశ్వరరావు

  • బాలానగర్ డివిజన్ లో కళ్యాణి నగర్ నుండి పాదయాత్రను ప్రారంభించిన బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ సతీమణి శ్రీమతి విజయలక్ష్మి

కూకట్పల్లి నియోజకవర్గం: బాలానగర్ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ నాయకత్వాన్ని బలపరుస్తూ సోమవారం వినాయక నగర్, సాయినగర్, చేరబండ కాలనీ బిజెపి శ్రేణులు, జనసేన శ్రేణులు, మహిళా నాయకులు కలిసి ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారిని ఈసారి మీరందరూ కలిసి గెలిపించాలని అలాగే ఎన్నికలలో అందరూ విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ప్రతి ఒక్కరు కూడా క్రమ సంఖ్య ఏడు 7, గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రమేష్, నాగరాజు, సునీల్, డివిజన్ నాయకులు, బిజెపి నాయకులు, జనసేన నాయకులు, మహిళా నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.