కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో పూలే కు ఘన నివాళులు
కాకినాడ సిటి: జ్యోతీరావ్ పూలే వర్ధంతి పురస్కరించుకుని మంగళవారం కాకినాడ సిటిలో జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో పాతబస్ స్టాండ్ సెంటర్లోని పూలే విగ్రహానికి పూలదండలతో నివాళులు అర్పించడం జరిగినది. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ.. భారతదేశంలో చరిత్ర సృష్టించిన మహానుభావులలో పూలే ఒకరని, ఆయన అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసారు అనీ, ఫులే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ను ఏర్పాటు చేశారన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఈ సంఘంలో అన్ని మతాలు, కులాల ప్రజలు కూడా చేరేలా కృషిచేసారన్నారు. సమాజం వీరిసేవలని ఎన్నటికీ మరువదని ఆయన ఆశయాలను, అదర్శాలను భావితరాలకు తెలియచేయడం ప్రతిఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసెన పార్టీ నాయకులు, వీరమహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/11/WhatsApp-Image-2023-11-28-at-7.55.45-PM-1-1024x768.jpeg)