మన ఊరు అభివృద్ధి కోసం ఉదయ్ శ్రీనువాస్ ను గెలిపిద్దాం

పిఠాపురం నియోజకవర్గం: జనసేన పిఠాపురం ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనువాస్ ఆదేశాలు మేరకు పిఠాపురం మండలం, పి దొంతమూరు గ్రామం జనసేన నాయకులు కర్రి హరిబాబు ఆధ్వర్యంలో దళిత వాడలో పర్యటన మన ఊరు అభివృద్ధి కోసం మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించిన ఉదయ్ శ్రీనువాస్ ను గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపిద్దాం అనే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిరుపేద 3 కుటుంబాలకు బియ్యం బస్తాలు కర్రి హరిబాబు, పి. ఎస్. ఎన్. మూర్తి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనువాస్, పెంకే జగదీష్, కోలా దుర్గాదేవి, పబ్బిరెడ్డి దుర్గా ప్రసాద్, నామ శ్రీకాంత్, దొంతమూరు జనసేన నాయకులు కర్రి హరిబాబు, చింతల శశి, పల్లా సందీప్, గుడాల ఏడు కొండలు, గుడాల విష్ణు, చక్రవర్తుల దన, చక్రవర్తుల స్వామి, గుండే రాజు, బండి శ్రీను, వాసం శెట్టి రాము, దిబ్బిడి రాజు, కొత్త రాజు, బల్లపాటి స్వామి తదితరులు పాల్గొన్నారు.