నిరుద్యోగల ధర్నాకు మద్ధతుగా రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరుద్యోగల ధర్నా నిర్వహించారు. ఏఈఎంసి అనే సంస్థ ఉద్యోగాల పేరుతో తమవద్ద డబ్బులు దండుకొని మోసం చేశారని కరక్టేట్ వద్ద నిరుద్యోగలు నిరసన వ్యక్తం చేశారు. ఏఈఎంసి సంస్ధపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. బాధితులకు అండగా రెడ్డి అప్పల నాయుడు నిలిచారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది బ్రోకర్లు ఒక సంస్థను ఏర్పాటు చేసి నిరుద్యోగుల దగ్గర నుండి డబ్బులు దండుకునే ప్రక్రియ ఏలూరులో చాలా వేగంగా జరుగుతుంది. దీనిలో భాగంగానే ఆదిత్య మేన్ పవర్ కన్సల్టెన్సీ అనే సంస్థను తలసాని నరసింహ, రాయపాటి సంతోష్ ఏర్పాటు చేసి సుమారుగా 200 మంది దగ్గర లక్ష, 2 లక్షలు అంగన్వాడీ పోస్టులు అని, హౌస్ లోన్స్ ఇప్పిస్తామని, సూపర్ వైజర్లు ఇస్తామని, కో-ఆర్డినేటర్స్ ఇస్తామని ఉద్యోగం లేని నిరుద్యోగుల్ని ఆశ చూపించి వారి దగ్గర కోట్లాది రూపాయలు దండుకునీ మోసం చేసి పారిపోయే పరిస్థితి జరుగుతుంది. ఇపుడు ఏలూరులోనే జరిగింది. ఆదిత్య మేన్ పవర్ కన్సల్టెన్సీ అనే సంస్థ యొక్క యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తక్షణమే అరెస్టు చేసి బాధితులు అందరికీ డబ్బులు ఇప్పించాలి. నష్టపరిహారం చెల్లించే విధంగా కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలి.. తప్పుడు కంపెనీలు పుట్టగొడుగుల పుట్టుకొస్తున్నాయి. ఏలూరులో నిరుద్యోగుల్ని మోసం చేసే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అధిక మొత్తంలో వడ్డీకి రుణాలు తీసుకొచ్చి రెండు సంవత్సరాల నుండి వెనకాలే తిప్పుతూ, ఇప్పుడు చల్లని చెక్కులు ఇచ్చి మోసం చేయడం ఈ సంస్థ చేస్తుంది. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం కూడా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ప్రక్రియను ప్రారంభించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. బలహీనవర్గాలు, వెనకబడిన వర్గాలు, నిరుద్యోగులు ఏదో ఒక ఉపాధి కలిగితే 10వేలు, 12వేలు, 15000 వస్తే కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆలోచనతో అప్పులు చేసి తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు. ఈ విధంగా మోసపోయిన నిరుద్యోగులందరికీ న్యాయం చేయాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. న్యాయం జరగని పక్షంలో బాధితులు అందరిని కలుపుకొని కలెక్టరేట్ వద్ద భారీగా దీక్షకు పూనుకుంటామని దీక్షను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్ జనసైనికులు పాల్గొన్నారు.