జనసేన పార్టీ క్రియాశీలక ఆత్మీయ సమావేశం

ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన-టిడిపి సమన్వయ కమిటీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చింతా సురేష్ బాబు ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గం, నందికొట్కూరు మండలం, కొణిదెల గ్రామంలో ఆత్మీయ సమావేశ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన-తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ బాధ్యుడు నల్లమల రవికుమార్, తెలుగుదేశం పార్టీ నందికొట్కూరు రూరల్ కన్వీనర్ ఓబుల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్లమల రవికుమార్ మాట్లాడుతూ వైసీపీ నాయకుల వల్ల రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని, పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్యాయం జరిగిందని, నిరుద్యోగులను నిరాశ పరిచారని, రైతులకు తీరని అన్యాయం చేశారని తెలియజేయడం జరిగింది. కనుక 2024లో వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రజలు అర్థం చేసుకొని మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరడం జరిగింది. జనసేన తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కలిసి ప్రజల్లోకి వెళ్లి వాస్తవాన్ని తెలియజేస్తూ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కొనియాడారు. ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ రాక్షస పాలనను గద్దె దించాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి కృషి చేయాలని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం చాలా సంతోషకరమని కొనియాడారు. భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. గ్రామస్థాయిలో రాజకీయపరంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నా అని భరోసా ఇవ్వడం జరిగింది. కొణిదెల గ్రామ జనసేన పార్టీ నాయకులు శివ కుమార్ మాట్లాడుతూ 2024లో వైసిపి పార్టీని పారద్రోలడానికి అన్ని విధాలుగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళుతుందని భరోసా ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ కొణిదెల గ్రామ స్థానికులు శివ కుమార్, షేక్షావలి, భాస్కర్, వీరభద్ర, శివ శంకర ఆచారి, ఆధ్వర్యంలో కొణిదెల గ్రామంలో ఆత్మీయ సమావేశం దిగ్విజయంగా జరిగినది. ఈ సమావేశంలో టీడీపి నాయకులు హరీష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మధు, రాజు, స్వాములు, పుష్ప రాజు, జనసైనికులు రామకృష్ణ, వేణుగోపాల్, విశ్వాతేజ, భార్గవ్, సురేష్, వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.