కామేశ్వరినగర్ లో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కి హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో మంగళవారం భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కి హామీ యాత్రా కార్యక్రమం కామేశ్వరినగర్ ప్రాంతంలో తుమ్మలపల్లి సీతారాం ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారి కష్టాలపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి చూస్తుంటే కొద్ది కాలం గడిస్తే ఇకపై ఈ భవననిర్మాణ రంగంలో కార్మికులు ఆసక్తి చూపే పరిస్థితి లేదనీ అప్పుడు మొత్తం గందరగోళ పరిస్థితి ఎదురయ్యేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ వై.సి.పి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలవల్ల, స్వార్ధ ప్రయోజనాలకోసం ఇసుక విధి విధానాల వల్ల కార్మికుల దగ్గరనుండీ వారిపై ఆధారపడి ఉన్న వివిధ రంగాలు సైతం దెబ్బతిన్నాయన్నారు. కేవలం అక్రమ సంపదన కోసం మొత్తం కార్మికుల కడుపు కొట్టిన పాపం ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదే అన్నారు. అందుకే భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు కోసం జనసేన పార్టీ తెలుగుదేశంలు ఉమ్మడి మేనిఫెస్టోలో ముఖ్యమైన ప్రతిపాదనలు చేపడుతున్నాయని కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డోలంకి మురళీ కృష్ణ, తోరం చిరంజీవి, రావిపాటి వెంకటేశ్వర రావు, నున్న సత్యనారాయణ (బాబి), గరగ శ్రీనివాస్, ఎర్రంశెట్టి జగదీష్, చొడపునీడి రామసతిష్ తదితరులు పాల్గొన్నారు.