రైతులకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలని ఆర్.డి.ఓ కి వినతి

రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో మిచౌన్గ్ తుఫాన్ వలన నష్టపోయిన అరటి, బొప్పాయి, పసుపు, వరి తదితర పంట రైతులకు తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలి అని జనసేన నాయకులు ఆర్.డి.ఓ రామకృష్ణారెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు చెంగారి శివప్రసాద్ మాట్లాడుతూ అసలే రైతులకి గిట్టుబాటు ధర లేక కొట్టుమిట్టడుతున్న వారి పైన మూలిగే నక్కపై తాటి పండు పడ్డ విధంగా ఉందని ఆయన తెలియజేసారు. రైతులకి కరెంటు సరఫరా తుపాన్ వలన ఆగిపోవడంతో వారు పడుతున్న ఇబ్బందిని గ్రహించి కరెంటు సరఫరాలో అంతరాయం లేకుండా వైసీపీ ప్రభుత్వం చేయాలని తెలియజేసారు. రాజంపేట పార్లమెంట్ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు తక్షణ సహాయం చేసి ఉపశమనం కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నంద్యాల హరి టీడీపీ రాజంపేట నాయకులు మణి, జనసేన నాయకులు అబ్బిగారి గోపాల్, కత్తి సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు.