తూఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి: ఎన్ని రాజు
రాజాం నియోజకవర్గం, రాజం మండలం, బుచ్చంపేట గ్రామంలో తూఫాన్ కారణంగా రైతుల పంట పొలాలను పరిశీలించిన జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు ఎన్ని రాజు. ఈ సందర్భంగా ఎన్ని రాజు మాట్లాడుతూ “తుఫాన్ కారణంగా ఈ గ్రామంలో వరిపంట నష్టం జరిగింది. తక్షణమే రెవెన్యూ అధికారులు ఈ పంట పొలాలను సందర్శించి ఆయా రైతులకు నష్టపరహారాన్ని అందించాలని, అదేవిధంగా ఈ ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు”. ఈ కార్యక్రమంలో రేగిడి మండల అధ్యక్షుడు ఎస్.అప్పలనాయుడు, ప్రవీణ్ దుర్గారావు, అనుదీప్, రామకృష్ణ, సూర్యనారాయణ, గణేష్, శ్రవణ్, గవరయ్య, హరిబాబు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-06-at-18.22.54-1024x576.jpeg)