కాకతీయ కమ్మ సేవా సమితి సంఘానికి భారీ విరాళం ప్రకటించిన బొర్రా
సత్తెనపల్లి నియోజకవర్గం: గుంటూరు రోడ్ లో సాగర్ కాల్వ పక్కన నందమూరి తారక రామారావు ఆధ్యాత్మిక ప్రాంగణంలో కాకతీయ కమ్మ సేవాసమితి (సత్తెనపల్లి) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్తిక వన సమారాధన
కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకతీయ కమ్మ సేవా సంఘానికి రెండు లక్షల ఐదు రూపాయలు విరాళం ఇచ్చిన బొర్రా.. జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావును కాకతీయ కమ్మ సేవా సమితి బాధ్యులు ఘనంగా సన్మానించారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-10-at-5.26.57-PM-1024x768.jpeg)