బేరే ఈశ్వర్ ని పరామర్శించిన టి సి వరుణ్

  • అధికార పార్టీ నాయకుల దాడిలో తీవ్ర గాయాల పాలై ప్రాణాపాయ స్థితి నుండి కోలుకుంటున్న బేరే ఈశ్వర్ ని పరామర్శించిన ఉమ్మడి అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టి సి వరుణ్

పెనుగొండ నియోజకవర్గం: గోరంట్ల మండలంలో ఈ వార్త చైర్మన్ బీరే ఈశ్వర్ పెనుకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వాస్తవాలు వార్తల రూపంలో రాయడంతో ఇది జీర్ణించుకోలేని అధికార పార్టీకి చెందిన నాయకులు దాడి చేయడం జరిగింది. ఈ దాడి వలన ఈశ్వర్ తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స తీసుకొని ప్రాణాపాయ స్థితిలో నుండి బయటపడి తన స్వగృహంలో బెడ్ రెస్ట్ తీసుకుంటున్న క్రమంలో ఈశ్వర్ ని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పి ఈ దాడి చేయడం ఇది రెండోసారని ఈశ్వర్ పేర్కొన్నారు. ఈ దాడి చేసింది ఎవరైనా సరే వారిని కచ్చితంగా శిక్షించే వరకు పోరాడతామని హామీ ఇచ్చి జనసేన పార్టీ వారికి అన్ని సహాయ సహకారాలు అందించి అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేసిన జిల్లా అధ్యక్షుడు టి సి వరుణ్ ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి అంకె ఈశ్వర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి వెంకటేష్, గోరంట్ల మండల కన్వీనర్ సంతోష్, మండల నాయకులు నరేష్ యాదవ్, రాఘవేంద్ర, నాగేంద్ర శ్రీనివాసులు. నాగేష్, తిరుపాల్ శ్రీరాములు, గోవిందప్ప తదితరులు పాల్గొన్నారు.