25 కుటుంబాలకు సహాయం చేసిన కర్రి హరిబాబు

పిఠాపురం, జనసేన పిఠాపురం ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు జనసేన నాయకులు కర్రి హరిబాబు 25 కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది. పిఠాపురం ప్రజలకు అలుపు లేకుండా సర్వీస్ చేస్తున్న జనసేన పార్టీ పి.ఎస్.ఎన్ మూర్తి టీమ్, కర్రి హరిబాబు పిఠాపురం మండలం పి.దొంతమూరు దళిత కాలనీలో తీవ్ర తుఫాను తాకిడికి నిలువ నీడలేక, ఆహారం అందక పేద ప్రజలు ఇబ్బందులు పడటం బాధాకరం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వాపోయారు. ఎప్పుడు విపత్తు వచ్చినా సాయం చేయడంలో ముందుండే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పి.ఎస్.ఎన్ మూర్తి, కర్రి హరిబాబు ఈ సారి కూడా తన వంతు సాయానికి 25మందికి 5 కేజీల బియ్యం 1 ఆయిల్ పేకట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సాధ్యమైనంత త్వరగా చేతనైన సాయంతో ఊరట కల్పించారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు బాధల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, టైల్స్ బాబీ, కసిరెడ్డి నాగేశ్వరావు, కోలా దుర్గాదేవి, పెంకే జగదీష్, భీమేశ్వరావు మల్లం బీసీ నాయకులు వై.శ్రీనివాస్, తోట సతీష్, పబ్బిరెడ్డి ప్రసాద్, నామ శ్రీకాంత్, పి.దొంతమూరు జనసేన నాయకులు కర్రి హరిబాబు, చింతల శశి, పల్లా సందీప్, గుడాల ఏడు కొండలు, గుడాల విష్ణు, చక్రవర్తుల దన, చక్రవర్తుల స్వామి, గుండే రాజు, బండి శ్రీను, వాసంశెట్టి రాము, దిబ్బిడి రాజు, కొత్త రాజు, బల్లపాటి స్వామి మరియు పి.ఎస్.ఎన్. మూర్తి పాల్గొన్నారు.