నాదెండ్ల మనోహర్ మాట కాకినాడలో అందరి నోట

కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇన్చార్జి మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముతా శశిధర్ ఆదేశాల మేరకు స్థానిక సూర్యనారాయణపురంలో నాదెండ్ల మనోహర్ మాట కాకినాడలో అందరి నోట అనే కార్యక్రమాన్ని స్థానిక 28 డివిజన్లో రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను ఏమార్చి వారికి సంక్షేమ పధకాలను అమలుచేస్తున్నా అనిచూపిస్తూ వాటి ద్వారా ఎన్నో రకాలు స్కాములు చేస్తున్నాడు అని ప్రజలకు చైతన్యం కలిగించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడలో అన్ని సెంటర్లోని జనసైనికులు అందరూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి చేసిన స్కాములు నాదెండ్లు మనోహర్ బయటపెట్టడం ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని ఆయన తెలిపారు. గేదెల కుంభకోణం, మద్యం కుంభకోణంలో, ఇసుక కుంభకోణంలో, భవన నిర్మాణ కార్మికుల కుంభకోణంలో, ఇలా ప్రతి రంగంలోనూ ఆయన అవినీతి పరాకాష్టకు చేరుకుందని ఆయన అవినీతి చేస్తూ ప్రజలందరినీ కూడా మభ్యపెడుతున్నారని కాకి లెక్కలతో ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని మనమందరం గద్దె దించుదామని చెపుతూ జనసేన పార్టీ ప్రతి సందర్భంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మోసాలు చెబుతున్న కాకి లెక్కలు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో ఆయన్ని ఆయన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఓడించి వారిని బుద్ధి చెప్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పోలిశెట్టి రామారావు, సిటి కార్యదర్శి ముత్యాల దుర్గాప్రసాద్, సతీష్, కొమిరెడ్డి చిన్ని జనసేన నాయకులు పాల్గొన్నారు.