జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి నియమింపబడిన వ్యక్తులే ఫైనల్

  • జనసేన లీగల్ సెల్ ప్రసిడెంట్ అమర నారాయణ

పుంగనూరు నియోజకవర్గం: పుంగనూరు పట్టణంలో నిర్వహించిన విలేకరులు సమావేశంలో జనసేన లీగల్ సెల్ ప్రసిడెంట్ అమర నారాయణ మాట్లాడుతూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుండి నియమింపబడిన వ్యక్తులే ఫైనల్ అని పార్టీ పదవులు సంబంధించి మీడియా ప్రతినిధులకు తెలియజేశారు. ఏవైనా పదవులు ఇవ్వాలి అంటే జిల్లా అధ్యక్షులు, పార్టీ హై కమాండ్ నిర్ణయం తీసుకుని అధికారికంగా విడుదల చేస్తారు, అంతే కానీ నియోజకవర్గంలకి పెయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉన్న వ్యక్తులుకి గానీ ఇతర పదవులలో ఉన్న వ్యక్తులకు నియమించే హక్కు లేదు, అల నియమిస్తే ఆ కమిటీలను వారి వ్యక్తిగతమైన పదవులేగానే భావిస్తాము, పార్టీకి సంబంధం లేదు, అదే విధంగా గత సంవత్సరం ముందు కేంద్ర కార్యాలయం నుండి విడుదల చేసిన మండల పార్టీ అధ్యక్షులుగా నియమించబడిన వ్యక్తుల పేర్లను చదివి వినిపించారు, పార్టీ ఆదేశాల ప్రకారం పుంగనూరు టౌన్ అధ్యక్షులుగా నరేష్ రాయల్ ను, రూరల్ కు విరూపాక్ష, చౌడేపల్లికి పురుషోత్తం, సోమలకి భూషణ్ రాయల్ ను, సదుంకు నాగ తేజను, పులిచేర్లకు దీప మోహన్ ను, రొంపిచర్ల కు అంచాల శేఖరను పుంగనూరు నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులుగా నియమిస్తూ పార్టీ గత ఒక సంవత్సరం ముందే నియమించబడి ఉంది. వేరే మండల పార్టీ అధ్యక్షులు, విరు తప్ప ఇంక ఎవరైనా పార్టీ పదవులు ఇస్తున్నాం అని ఇస్తే పార్టీకి వ్యతిేకంగానే మేము భావిస్తున్నాము, ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పగడాల రమణ, జిల్లా ప్రోగ్రామ్స్ కార్యదర్శి చైతన్యరాయల్, పుంగనూరు మండల అధ్యక్షుడు విరుపాక్షి, నాయకులు హరీ నాయక్, మురళి రాయల్, బాలాజీ నాయక్, నాయుడులు పాల్గొన్నారు.